Header Banner

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

  Mon Jun 09, 2025 09:30        India

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల విస్తరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికుల సేవలో ఉన్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో రెండు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు చీనాబ్ నదిపై నిర్మించిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ బ్రిడ్జ్ మీదుగా పరుగులు పెడతాయి. ఫలితంగా న్యూఢిల్లీ నుంచి కాట్రా మీదుగా శ్రీనగర్ వరకు నేరుగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఇది ముఖ్యంగా ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే భక్తులకు రవాణా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచనుంది.

 

ఇది కూడా చదవండి: దేశం గర్వపడేలా మరో తెలుగు మహిళ మాధవి లత! చంద్రబాబు అభినందనలు!

 

నార్తర్న్ రైల్వే విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం, ఈ రెండు రైళ్లు వారంలో ఆరు రోజులు (ఒక రైలు బుధవారం మినహా, మరో రైలు మంగళవారం మినహా) నడుస్తాయి. 26404 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 8:00 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరి 10:58 నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:55 గంటలకు కాట్రా నుంచి బయలుదేరే 06403 రైలు, సాయంత్రం 7:53కి శ్రీనగర్ చేరుతుంది. మరో వైపు, 26401 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం మినహా ఉదయం 8:10కి కాట్రా నుంచి బయలుదేరి 11:08కి శ్రీనగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంగా, 2:00 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరే 06402 రైలు, సాయంత్రం 4:58కి కాట్రా చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు బనిహాల్ స్టేషన్ వద్ద 2 నిమిషాల హాల్ట్ కలిగి ఉంటాయి.

 

ఇది కూడా చదవండి:  ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

నేడు (9/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #VandeBharatExpress #SrinagarToKatra #KatraToSrinagar #VaishnoDeviTrain #SemiHighSpeedTrain #IndianRailways #ModiGovernment #NewIndiaConnectivity #JammuKashmirDevelopment #NorthernRailway